ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్‌లైన్‌లో కొత్తఫాస్ట్‌ట్యాగ్ ఎలా కొనాలి? ప్రాసెస్ ఇదే.. చాలా సింపుల్!

business |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2024, 12:20 AM

జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు టోల్ పేమెంట్స్ చేసేందుకు ఫాస్ట్‌ట్యాగ్స్ ఎంతో ఉపయోగపడతాయి. క్షణాల్లో తమ ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (RFID) ద్వారా పేమెంట్లు జరిగిపోతాయి. దీంతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఒక్కసారి ఫాస్ట్‌ట్యాగ్ తీసుకుంటే అది ఐదేళ్ల పాటు వాలిడ్‌గా ఉంటుంది. మీ అవసరాలకు తగినట్లుగా వాటిని రీఛార్జ్ లేదా రీలోడ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది ఫాస్ట్‌ట్యాగ్ జారీలను నిలిపివేసింది. ఇప్పటికే ఖాతా ఉన్న వారు మార్చి 15లోపు బదిలీ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయాలని అనేది తెలుసుకుందాం.


మీరు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ అనేది ఆథరైజ్డ్ సంస్థల వద్ద కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు వీటిని జారీ చేస్తుంటాయి. వాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విభాగం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ (IHMCL) ఆథరైజేషన్ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.


ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్ పోర్టల్ లోకి లాగిన్ కావాలి.


హోమ్ పేజీలో ఫస్ట్ టైమ్ యూజర్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత మీ వివరాలు అన్ని ఇవ్వాలి. పేమెంట్స్ చేయాలి.


ఈ ప్రక్రియ పూర్తియిన తర్వాత మీ ఇంటికే ఫాస్ట్‌ట్యాగ్ కార్డు వస్తుంది.


మీరు వివిధ పద్ధతుల ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎన్ఈటీసీ ఫాస్ట్‌ట్యాగ్ వాలెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అందులో మైకార్డ్స్ పోర్టల్ ద్వారా యాడ్ ఫాస్ట్‌ట్యాగ్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత వెహికల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫాస్ట్‌ట్యాగ్ యాడ్ అయిన తర్వాత రీఛార్జ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ వెహికల్ నంబర్ ఎంటర్ చేసిన కావాల్సిన అమౌంట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు.. ఫాస్ట్‌ట్యాగ్ పోర్టల్ ద్వారా రీఛార్జ్ చేయొచ్చు. అందులో పోర్టల్ లోకి వెళ్లి క్విక్ రాఛార్జ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ వెహికల్ నంబర్ ఎంటర్ చేసి రీఛార్జ్ పూర్తి చేయొచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయితే.. లాగిన్ అయిన తర్వాత పేమెంట్ సెక్షన్ లో బిల్ పే నుంచి యాడ్ బిల్లర్.. ఫాస్టాగ్.. వివరాలు ఇచ్చిన తర్వాత రీఛార్జ్ చేయొచ్చు.


మరోవైపు.. యూపీఐ యాప్ ద్వారా కూడా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేయవచ్చు. ముందుగా ఏదైనా యూపీఐ యాప్ లోకి వెళ్లాలి. అందులో పాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్లిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ - ఫాస్ట్ ట్యాగ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వెహికల్ నంబర్ ఎంటరి చేసి రీఛార్జ్ పూర్తి చేయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa