ఈ ఏడాది ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. రంజీ-2024 సీజన్ తర్వాత.. మనోజ్ తివారీ(బెంగాల్), సౌరభ్ తివారీ(ఝార్ఖండ్), వరుణ్ ఆరోన్(ఝార్ఖండ్), ధవల్ కులకర్ణి(ముంబై), ఫయాజ్ ఫజల్(విదర్భ), ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఈ ఐదుగురు ఒకప్పుడు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు.
క్రికెట్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ ఆటగాడు, మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రంజీ ట్రోఫీలో బీహార్పై బెంగాల్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం కోలకతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. 2011లో సెంచరీ చేసిన తర్వాత కూడా తుది జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అడగాలనుకుంటున్నానని తివారీ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa