ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు (గురువారం) పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు. ఈరోజు ఐదు కుటుంబాలను పరామర్శించి, ఆర్ధికసాయం అందించనున్నారు.
భువనేశ్వరి పర్యటన షెడ్యూల్
మధ్యాహ్నం
12:10 గంటలకు పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కమ్మపల్లిలో పర్యటన
1:10 గంటలకు పడగాలవారిపల్లె గ్రామల్లో కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
3:35 గంటలకు పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, చింతగుంబలపల్లిలో పర్యటన
సాయంత్రం
05:10 గంటలకు బంగారుపాళ్యం మండలం, టేకుమండ గ్రామంలో కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ పరామర్శిస్తారు.
06:40 – చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరుటౌన్ 50వవార్డు కోకలూరులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
07:15 – చిత్తూరు, పంట్రంపల్లి మురుకుంబట్టు బైపాస్ సమీపంలో రాత్రి బస.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa