ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో కేంద్రానికి లొంగిపోయాడని, కేంద్రం ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను వాడి విపక్షాలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 17 ఏ కత్తి పెట్టి చంద్రబాబును లొంగదీసుకోవలనే ప్రయత్నం చేస్తోందన్నారు. పిరికిపందా రాజకీయాలు చేసేవారు రాజకీయాల్లో ఉండటం సరికాదని, సొంత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని ఆయన అన్నారు. జగన్ తన స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారని, విభజన హామీలు అమలు చేయకపోయినా.. బీజేపీ కాళ్ళు పట్టుకోవడం దారుణమని నారాయణ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa