విశాఖ జీవీఎంసీలో వార్డ్ సెక్రటరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీవీఎంసీ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వార్డ్ సెక్రటరీ ఆది శివమూర్తి తెలిపాడు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట చేతి మణికట్టు కోసుకుని ఆది శివమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీవీఎంసీలో వార్డులో సమస్యలను లేవనెత్తినందుకు తనను అధికారులు సస్పెండ్ చేశారని బాధితుడు వాపోయాడు. పది నెలలుగా తన ఉద్యోగం ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో బాధితుడు ఆవేదనకు గురయ్యాడు. తన చావుకు జీవీఎంసీ కమిషనర్, ఏడీసీ సన్యాసిరావు, కొలాబు చక్రవర్తి, జోనల్ కమిషనర్ ఆర్ జి కృష్ణ, బండారు రాంబాబులే కారణమంటూ బాధితుడు ఆది శివమూర్తి సూసైడ్ నోట్లో రాశాడు. ప్రస్తుతం ఆది శివమూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa