సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల వడబోతలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి బుధవారమంతా బిజీగా ఉన్నారు. ఆంధ్రరత్నభవన్లో ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న ఆశావహులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఏడు లోక్సభ స్థానాలు... నర్సాపురం, ఏలూరు, నరసారావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం నియోజకవర్గాల దరఖాస్తుదారులతో మాట్లాడారు. అదేవిధంగా ఈ పార్లమెంటుస్థానాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్న 280 మంది దరఖాస్తుదారులతో షర్మిలరెడ్డి చర్చించారు. ఈ వడబోత ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. కాగా, గురువారం మరో తొమ్మిది లోక్సభ స్థానాలకు దరఖాస్తు చేసిన నేతలు.. 63 అసెంబ్లీ నియోజకవర్గాల దరఖాస్తుదారుల అభ్యర్థిత్వాలను షర్మిలరెడ్డి పరిశీలిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa