టీడీపీ, జనసేన కూటమిని గెలిపించుకొని చంద్రబాబును సీఎంను చేస్తేనే రాష్ట్రానికి మనుగడ ఉంటుందని ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. కొత్తగూడెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి వారు ఆవిష్కరించి మాట్లాడుతూ ఐదేళ్ళుగా జగన్ విధ్వంసక, అరాచక పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, వైసీపీ బూటకపు వాగ్దానలకు మళ్ళీ మోసపోతే భావితరాలకు మనుగడ ఉండదన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అడ్డదారుల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నదని టీడీపీ, జనసేన శ్రేణులు వైసీపీ కుట్రలు తిప్పికొట్టాలన్నారు. అంతకు ముందు సోమవరం గ్రామం వద్ద మాగంటి, పార్థసారథికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడే దివంగత టీడీపీ నాయకులు యర్రోజు సత్యనారాయణ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం సోమవరం నుంచి కొత్తగూడెం వరకు బారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు గంగాధర్, అట్లూరి రమేష్, నూతక్కి వేణు, మండల నాయకులు బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి చిట్టిబాబు, వెల్ది నాగేశ్వరరావు, రాజారత్నం, శేఖర్, దుర్గారావు, వెల్ది రాజారావు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa