విజయనగరం జిల్లా,గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త సహకారం తీసుకుని ఎన్నికల్లో మందుకు వెళ్తామని గజపతినగరం టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని జగ్గాపురం, నీలావతి, నరవ, కొటారుబిల్లి, బుడతనాపల్లి, పెణసాం, గొడియాడ, కిర్తుబర్తి గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించి, సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. అనంతరం కొటారుబిల్లి కూడలిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో మండల స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, మాజీ జడ్పీటీసీ కొరుపోలు రమేష్కుమార్, టీడీపీ నాయకులు కశిరెడ్డి పాపునాయుడు, బీల అప్పలనాయుడు, వెంకటరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa