ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. గుంటూరు జిల్లా గోరంట్లలో హోసన్నా మినిస్ట్రీస్ 47వ వార్షిక సమావేశాలు ఈ నెల 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 6, 10 తేదీల్లో జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది.
అనకాపల్లి-గుంటూరు(07225) ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు బుధవారం రాత్రి 10.05 గంటలకు జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో, 10.25 గంటలకు నిడదవోలు రైల్వేస్టేషన్లో ఆగుతుంది. గుంటూరు-అనకాపల్లి(07226) ప్రత్యేక రైలు ఈ నెల 10న తెల్లవారుజామున 3.05 గంటలకు నిడదవోలు రైల్వేస్టేషన్లో, 3.45 గంటలకు రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో ఆగుతుంది.
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ నెల 11, 18 తేదీల్లో ఎస్ఎంవీటీ బెంగళూరు-టాటానగర్ (12890).. 14, 19, 21 తేదీల్లో ఎస్ఎంవీటీ బెంగళూరు-హటియా (12836), 16న మంగుళూరు సెంట్రల్-సంత్రాగచ్చి(22852) రైళ్లు వయా కాట్పాడి, అరక్కోణం జంక్షన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa