మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజున భ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకుని తరించాలని పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి సైతం తరలివస్తుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల్లో కొంతమంది సొంత వాహనాల్లో ఇక్కడకు చేరుకుంటే.. చాలా మంది మాత్రం ప్రజారవాణా మీదే ఆధారపడుతూ ఉంటారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ద్వారా శ్రీశైలానికి చేరుకుని శివరాత్రి రోజు ఆ మల్లన్నను దర్శించుకుంటూ ఉంటారు. అయితే శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
భక్తులను అసౌకర్యం కలగకుండా కర్నూలు డిపో నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. 310 బస్ సర్వీసులను కర్నూలు డిపో నుంచి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక సర్వీసులను వాడుకోవచ్చని కర్నూలు డిపో అధికారులు తెలిపారు.అయితే ఈ ప్రత్యేక సర్వీసులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్ సర్వీసులు మొదలయ్యాయి. శ్రీశైలంలో మార్చి11 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్చి 12వ తేదీ వరకూ ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
అలాగే కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం కూడా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇలాంటి వారి కోసం కర్నూలు డిపో నుంచి వెంకటాపురం వరకూ రూ.150 ఛార్జీతో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ మల్లన్నను దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వీసులు తీసుకువచ్చినట్లు చెప్పారు. భక్తుల రద్దీ మరింత పెరిగితే అవసరమైతే మరిన్ని సర్వీసులు అందబాటులోకి తెస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa