ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా.. జనసేనకు షాక్ తగిలింది. పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే.. జనసేన పార్టీకి చెందిన కీలక నేత ఆ పార్టీ ఇంఛార్జి పదవికి గుడ్ బై చెప్పారు. చీరాల జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్కు పంపించారు . అయితే పార్టీలో కార్యకర్తగా ఉంటానని ఆమంచి స్వాములు స్పష్టం చేశారు.
చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడైన ఆమంచి స్వాములు.. కృష్ణమోహన్ విజయాల్లో కీలకంగా వ్యవహరించారు . అయితే గతేడాది వైసీపీని వీడిన ఆమంచి స్వాములు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిపోయారు. ఆ వెంటనే జనసేన అధిష్టానం ఆయనకు కీలక పదవికి అప్పగించింది. జనసేన రాష్ట్ర కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ ఆమంచి స్వాములను నియమించారు. ఇటీవలే చీరాల జనసేన సమన్వయకర్తగానూ బాధ్యతలు అప్పగించారు.
అయితే జనసేనాని నిర్ణయంపై స్వాములు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు పోటీచేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన కోఆర్డినేటర్ పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే సమన్వయకర్త పదవికి రాజీనామా చేసినట్లు ఆమంచి స్వాములు తెలిపారు. జనసేన కార్యకర్తగా కొనసాగుతానని లేఖలో స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa