టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి ముందుగా కారులో వెళ్తున్న కే.ఏ. పాల్ కాసేపు హంగామా చేశారు. పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ కారు ఆపి నినాదాలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ కీలక భేటీ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఇంటి ముందుగా కేఏ పాల్ వెళ్తున్నారు. భేటీ జరుగుతున్న విషయం తెలుసుకుని.. ఇంటి వద్ద కారు ఆపి పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కే.ఏ. పాల్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన నుంచి ప్రజలు కొత్తగా ఏం ఆశించడం లేదని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను ఏపీ ప్రజలు ఎన్నోసార్లు చూసి విసిగిపోయారని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీద కూడా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చంద్రబాబు చేశారని అన్నారు. పరిపాలన అంటే సినిమాల్లో డ్యాన్సులు వేయడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా ఏపీని మోసం చేస్తున్న బీజేపీ జనం నమ్మబోరన్న కేఏ పాల్.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
ఏపీ భవిష్యత్తు మారాలంటే తమ పార్టీతోనే సాధ్యమని పాల్ అన్నారు. పాల్ రావాలి.. పాలన మారాలి అని చెప్పిన కే.ఏ. పాల్.. సీనియర్ నాయకుడు బాబు మోహన్ తన పార్టీలోకి వచ్చాడని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తనను కలవాలని సూచించారు. అలాగే కాపులు అంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం అలోచించి ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పాల్ సూచించారు.
ఇక కేఏ పాల్ ఇలా హల్ చల్ చేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవలే ఏపీ సెక్రటేరియట్ వద్ద సైతం మెట్లపై కూర్చుని ఇలాగే హంగామా సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానంటున్న పాల్.. వచ్చే ఎన్నికల్లో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో పోటీ చేస్తామంటున్నారు. తాను వైజాగ్ నుంచి, బాబూమోహన్ వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరుఫున బరిలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa