మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు జనం పోటెత్తారు. మహాశివరాత్రి సందర్బంగా ఆ పరమేశ్వరుణ్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో శివాలయాలకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రాలకు కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా శ్రీశైల మల్లన్న దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు సైతం ఘనంగా నిర్వహించడంతో.. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు శ్రీశైలం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. ఈ లెక్కలను ఆలయ అధికారులు వెల్లడించారు. హుండీ ఆదాయాన్ని లెక్కించి వివరాలను తెలియజేశారు.
శ్రీశైలంలో 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.5.16కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే మహానంది ఆలయానికి వచ్చిన హుండీ ఆదాయాన్ని సైతం ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయానికి భక్తులు వివిధ రూపంలో సమర్పించిన కానుకల ద్వారా 6 రోజుల్లో రూ.58,28,276 ఆదాయం వచ్చినట్లు మహానంది ఆలయ ఆధికారులు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆలయాలకు హుండీ ఆదాయం భారీగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాగంటి, మహానంది, శ్రీశైలం క్షేత్రాలకు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాలను మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాలకు జనం పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా.. హుండీ ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa