వైఎస్.షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా విశాఖలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్.విజయమ్మ విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత అనుభవాల దృష్ట్యా షర్మిల విశాఖ కంటే సొంత జిల్లా కడప నుంచి పోటీచేయాలని పార్టీ సీనియర్లు కోరినట్లు తెలిస్తోంది. అధిష్టానం సైతం కడప నుంచి పోటీ చేయాలని కోరడంతో ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుంటంతో.. తన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులతో చెప్పేందుకు రేపు విజయవాడలో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కడపకు చెందిన పార్టీ నేతలతో షర్మిల సమావేశమవుతుండటంతో ఆమె కడప నుంచి పోటీ చేయవచ్చనే అంచనాలకు బలం చేకూరినట్లైంది. షర్మిల కనుక కడప నుంచి బరిలోకి దిగితే అక్కడి లోక్సభ సీటులో పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. షర్మిల రేపటి సమావేశంలో ఎలాంటి ప్రకటన చేస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa