ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలోకి పిఠాపురం జనసేన ఇంచార్జి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 03:52 PM

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. జనసేన పిఠాపురం మాజీ ఇన్‌ఛార్జి మాకినీడి శేషుకుమారి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జగన్‌ సమక్షంలో మాకినీడి శేషుకుమారి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషుకుమారి పోటీ చేశారు. కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, పిఠాపురం వైయ‌స్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa