ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా-ఒడిశా చెక్‌పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 05:46 PM

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. బుధవారం ఇ చ్ఛాపురం వచ్చిన కలెక్టర్‌ తహసీల్దార్‌ కార్యాలయం లో అధికారులతో మాట్లాడారు. అనంతరం చెక్‌ పోస్టును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా మద్యం, సారా, గంజాయి, డబ్బు అక్రమంగా తరలించే అవకాశం ఉందని, అనుమానం ఉన్న ప్రతీ వాహనా న్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు. ఆంధ్రా-ఒడిశా గ్రామాలు కలిసి ఉన్న మ్యాప్‌ను పరిశీలించారు. వీటితో పాటు కేదారి పురం రోడ్డులో ఉన్న రైల్వే గేటు వద్ద కూడా గస్తీ ఉంచి వాహనాలను చెక్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వరరావు రెడ్డి, ఎన్నికల రి టర్నింగ్‌ అధికారి బి.సుదర్శన్‌ దొర, సీఐ ఇమ్యా న్యుయేల్‌ రాజు, ఎస్‌ఐలు సత్యనారాయణ, లక్ష్మణ్‌ పోలీస్‌ సిబ్బంది, తహసీల్దార్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa