తిరుపతి ఎమ్మెల్యే టికెట్పై టీడీపీ నేత సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని.. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట బయటపెట్టేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరణి శ్రీనివాసులును జనసేన - టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని అన్నారు. కూటమిలో ఏ పార్టీ అయినా, అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని.. గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి స్థానికులై ఉండాలన్నారు. తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతరులు వద్దు అని అంటున్నారని తెలిపారు. అవసరమైతే జనసేన తరఫున తాను పోటీ చేస్తానని సుగుణమ్మ ప్రకటన చేశారు. కాగా.. తిరుపతి ఎమ్మెల్యే తానే అని.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ తన వెంటనే ఉన్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరణి శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమల ఎమ్మెల్యే టిక్కెట్ అంశం హాట్ టాపిక్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa