తడి గుడ్డతో గొంతులు కోయడంలో సీఎం జగన్ రెడ్డిని మించిన వారు ఉండరని తెలుగుదేశం సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. ‘‘సీఎం జగన్ రెడ్డి తన నోటి నుంచి ‘నా’ అన్నాడంటే నాశనం అనే అర్ధం. ‘నా’ బీసీ, ‘నా’ ఎస్సీ, ‘నా’ ఎస్టీ, ‘నా’ మైనార్టీ అంటూనే రూ.1.30 లక్షల కోట్లు దారి మళ్లించారు. ‘నా’ బాబాయ్ అని చంపేశారు, ‘నా’ తల్లి, ‘నా’ చెల్లి అని రోడ్డు పాలు చేశారు. ఈ నినాదాలు చుట్టూ ప్రజలు పరిగెత్తేలా చేసి ప్రజలను నాశనం చేయడమే జగన్ రెడ్డి విధానం’’ అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి మాత్రం ‘నా’ అంటూ నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. రూ.12వేల కోట్ల పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాలను నాశనం చేశారన్నారు. అణగారిన వర్గాల ప్రజలు జగన్ రెడ్డి మాయలకు మోసపోవద్దని చెప్పారు. అధికారం కోసం ఏమైనా చెప్పేందుకు, ఏమైనా చేసేందుకు జగన్ రెడ్డి సిద్ధమని అన్నారు. మన జీవితాలను నాశనం చేసిన జగన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిల్లి మాణిక్యరావు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa