తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఇవాళ 11 అసెంబ్లీ.. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.
13మంది ఎంపీ అభ్యర్థుల వివరాలు..
శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం - భరత్
అమలాపురం - గంటి హరీష్ మాధుర్
ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ - కేశినేని చిన్ని (శివనాథ్)
బాపట్ల - టి కృష్ణప్రసాద్
చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాదరావు
నంద్యాల - బైరెడ్డి శబరి
కర్నూలు - బస్తిపాటి నాగరాజు
నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
హిందూపురం - బీకే పార్థసారథి
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇలా..
కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు - బోడే ప్రసాద్
మైలవరం - వసంత కృష్ణప్రసాద్
ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి
పలాస - గౌతు శిరీష
శ్రీకాకుళం - గొండు శంకర్
నరసరావుపేట - చదలవాడ అరవింద్ బాబు
చీరాల - మద్దులూరి మాలకొండయ్య
పాతపట్నం - మామిడి గోవిందరావు
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
జనసేన, బీజేపీ సీట్ల ఖరారుపై చంద్రబాబు స్పష్టతకు వచ్చారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa