కదిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్కు బిగ్ రిలీఫ్. ఎన్నికల వేళ ఆయనకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కందికుంట వెంకట ప్రసాద్ మీద నమోదైన నకిలీ డీడీల కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 1999, 2003లో నకిలీ డీడీలతో బంగారం కొనుగోలు చేశారంటూ వెంకటప్రసాద్పై సీబీఐ గతంలో రెండు కేసులు నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టు గతంలోనే తీర్పును వెలువరించింది. కందికుంటకు ఒక కేసులో ఐదేళ్లు, మరో కేసులో ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కందికుంట వెంకటప్రసాద్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. కందికుంట వెంకటప్రసాద్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రెండు కేసులను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల వేళ తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవటంతో కందికుంట అభిమానులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే కందికుంట వెంకటప్రసాద్ మీద నమోదైన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేయటంతో కదిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ మార్చే అవకాశం ఉంది. కందికుంట మీద నకిలీ డీడీ కేసులు ఉన్న నేపథ్యంలో.. జైలు శిక్ష పడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కదిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఆయన సతీమణి కందికుంట యశోద దేవికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడా కేసులు కొట్టివేయటంతో కందికుంట వెంకట ప్రసాద్నే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కదిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరుఫున మక్బూల్ అహ్మద్ను బరిలో నిలిపారు. మైనారిటీలు అధికంగా ఉండే కదిరి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టిపోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa