ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అభ్యర్థుల స్థానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. శనివారం రెండు స్థానాలకు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించారు. పి.గన్నవరం స్థానానికి గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన జనసేన అధినేత.. తాజాగా ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. జనసేన తరుఫున చిర్రి బాలరాజును పోటీలో నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు బాలరాజు అభ్యర్థిత్వాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
2019లో పోలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాస్ మీద తెల్లం బాలరాజు ఘన విజయం సాధించారు. అయితే 2014లో బొరగం శ్రీనివాస్ పోలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2019లోనూ రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరుఫున మరోసారి అవకాశం వస్తుందని ఆయన భావించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలోనే జనసేన తరుఫున చిర్రి బాలరాజు అభ్యర్థిత్వాన్ని పవన్ ఖరారు చేశారు.
మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు మొత్తం 21అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కేటాయించగా.. మెజారిటీ స్థానాలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తొలివిడతలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన పవన్.. ఆ తర్వాత ఒకటీ, రెండు పేర్లు విడుదల చేస్తూ వస్తున్నారు. తాను సైతం కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే క్రమంలోనే శనివారం రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ఖరారుచేశారు. టీడీపీ సైతం ఇప్పటికే 139 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ కూటమిలోని మరో పార్టీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa