ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 08:11 PM

కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పద్మావతి, వినయ ఇంట్లో ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.


పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసి ఉంది. పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు వారి భూమిని ఆన్‌లైన్‌ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. ఆ భూమిపై ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. భూమి వ్యవహారంలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa