ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛీ, ఛీ ఈ కానిస్టేబుల్ అసలు మనిషేనా.. భార్యపై నీచంగా, ఇదేం పాడుపని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 08:14 PM

అనకాపల్లిలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ భార్య పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించాడో కానిస్టేబుల్‌. శిరోముండనం చేయడంతోపాటు ఆమె కనుబొమ్మలనూ కత్తిరించాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనకాపల్లి టౌన్‌ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరంలోని రైల్వే న్యూకాలనీ శివాలయం వీధికి చెందిన గూడుపు జనయత్రి మహాలక్ష్మికి 2013లో తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన గూడుపు భవానీశంకర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. భవానీశంకర్‌ ప్రస్తుతం అనకాపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.


భవానీశంకర్‌ కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. ఆమెపై అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈనెల 18న మహాలక్ష్మిని ఆమె పుట్టింటికి పంపించాడు. మరుసటిరోజు అత్తారింటికి తిరిగి వెళ్లింది. అక్కడ అత్త, ఆడపడుచులు మందలించడంతో మహాలక్ష్మి పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 20న భవానీశంకర్‌ అత్తారింటికి వెళ్లి గట్టిగట్టిగా కేకలు వేస్తూ మహాలక్ష్మిపై దాడికి దిగాడు. ఆమె తప్పించుకుని ఓ గదిలోకి వెళ్లి ఉండిపోయింది.


భవానీశంకర్‌ మహాలక్ష్మి సోదరుడి బిడ్డను గట్టిగా పట్టుకుని గదిలో నుంచి రాకుంటే గొంతు నొక్కేస్తానని హెచ్చరించాడు. మహాలక్ష్మి బయటకు రాగా భవానీశంకర్‌ తనతోపాటు తీసుకువెళ్లిన ట్రిమ్మర్‌తో ఆమె జుట్టును కత్తిరించి గుండు చేశాడు. ఆ తరువాత కనుబొమ్మలను తొలగించాడు. ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహాలక్ష్మి తండ్రి, స్థానికులు అడ్డుపడటంతో పారిపోయాడు. భర్త చేసిన దారుణాలపై ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి.. హత్యాయత్నం, వేధింపులు, తదితర నేరాలకు పాల్పడినందుకు 409ఎ, 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి భవానీ ప్రసాద్‌ను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa