ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారులు సోదాలను ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం నియమించిన బృందాలు ఓ వైపు.. పోలీసులు మరోవైపు తనిఖీలను కట్టుదిట్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల కాన్వాయిలతో పాటుగా సాధారణ వాహనాలను సైతం తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన ధ్రువపత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, ఆభరణాలు ఇతర వస్తువులను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 44వ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లోనే భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ తరలిస్తున్న బంగారు ఆభరణాలు, వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, వజ్రాల విలువ రూ. కోట్లల్లోనే ఉండొచ్చని అంచనా. అనంతరం వజ్రాలు, అభరణాల బాక్సులను చిలమత్తూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, వజ్రాలు ఓ గోల్డ్ కంపెనీకి చెందినవిగా పోలీసులు గుర్తించారు. అయితే బంగారం, వజ్రాలకు సంబంధించిన బిల్లులు ఉన్నా .. పోలీసులు అనవసరంగా ఆపారని ఆ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే బిల్లులు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి..నిర్దారించుకుని పంపుతామని పోలీస్ అధికారులు చెబుతున్నారు,
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో పెద్దమొత్తంలో నగదు, నగలు తీసుకెళ్లడం ఇబ్బందికరం. సరైన పత్రాలు ఉంటేనే నగదు, నగలు తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు. అలాగే యాభై వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆ నగదుకు సంబంధించిన పత్రాలు ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ భారీ మొత్తంలో నగదు వెంట తీసుకెళ్లకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ నాలుగో తేదీ ఫలితాలు వెల్లడి చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa