ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. బిట్రగుంట- విజయవాడ మధ్య నడిచే (07977, 07978) మెము రైళ్లు గతనెలాఖరులో రద్దు చేయగా.. ఈ నెల 31వ తేదీ వరకు.. బిట్రగుంట- చెన్నై మధ్య నడిచే(17237, 17238) మెము రైళ్లు గతనెలాఖరులోనే రద్దు చేయగా.. ఈ నెల 29వ తేదీ వరకు పట్టాలెక్కవు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడోలైనుకు సంబంధించి రోలింగ్ కారిడార్ బ్లాక్ ప్రోగ్రామ్లు ఉన్నందున రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. రైళ్ల రద్దు కారణంగా విజయవాడకు వెళ్లే ప్రయాణికులు, రాజధానిలో జరిగే పనుల కోసం వెళ్లే సామాన్య ప్రయాణికులు, వైద్యసేవలకు చెన్నైకి వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
ఈ నెల 29,31 తేదీ వరకు రైళ్ల రద్దును ప్రకటించారు. అంతటితో ఆగుతుందా? కొనసాగుతుందా? అర్థంకాక ప్రయాణికులు కంగారుపడుతున్నారు. మెము రైళ్ల రద్దు సుమారు ఆరు నెలలుగా తరచూ జరుగుతుండటం.. ప్రయాణికుల అవస్థలపై బిట్రగుంట రైల్వేస్టేషన్ మేనేజర్కు రెండు రోజుల కిందట రైల్వే అభివృద్ధి కమిటీ ఫిర్యాదు చేసింది. చిన్నపాటి కారణాలు ఎదురైనా మెము రైళ్లు రద్దు చేయడం.. ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకపోవడం ప్రాయాణికులు ఇబ్బందిపడుతున్నారు. విజయవాడ- చెన్నై మధ్య నడిచే మెము రైళ్ల తీరు ఆరు నెలలుగా ఇలాగే ఉంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa