టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొడుకు బదులు తండ్రికి ఎంపీ సీటు కేటాయించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది.. అధికారిక ప్రకటన లాంఛనమే అంటున్నారు. తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీలో ఉంచబోతున్నట్లు ఏడాదిన్నర క్రితమే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలతో ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన రోజు, టీడీపీలో చేరిన రోజు కూడా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నాయకత్వానికి ఆ మేరకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆయన రాఘవరెడ్డి పేరును ప్రకటించారు.
టీడీపీ అధిష్టానం ఒంగోలు లోక్సభ పరిధిలో అభిప్రాయ సేకరణ చేసింది. తొలుత రాఘవరెడ్డి అభ్యర్థిగా ఆ తర్వాత శ్రీనివాసులరెడ్డి అభ్యర్థిగా ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం కొన్ని పరిణామాలు మారిపోవడంతో.. భవిష్యత్తులో కేంద్రంతో వివిధ అంశాలపై రాయబారాలు జరిపేందుకు లోక్సభ సభ్యులుగా పార్టీలో కొందరు సీనియర్లు, ఢిల్లీ రాజకీయాల్లో పట్టు ఉన్న వారు ఉంటే మంచిదని టీడీపీ భావించింది. ఇప్పటికే ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల్లో యువకులు, అందునా కొత్తవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో చంద్రబాబు శ్రీనివాసుల రెడ్డిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు చంద్రబాబు ఎంపీ మాగుంటకు ఫోన్చేసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. అయితే తన కుమారుడు రాఘవరెడ్డిని రంగంలో దింపాలనేది కుటుంబ నిర్ణయమని మాగుంట చెప్పగా.. పార్టీ నిర్ణయం వారికి తెలిపి ఒప్పించాలని చంద్రబాబు సూచించారు. మాగుంట అందరితో చర్చించి.. ఈసారి శ్రీనివాసులురెడ్డిని ఈసారి ఎన్నికల్లో ఒంగోలు నుంచి తానే పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలో ఉన్న కుమారుడు పరిస్థితిని అర్థం చేసుకొని తన తండ్రి పోటీలో ఉంటారని ప్రకటించారు.
మరోవైపు ఒంగోలు లోక్సభ అభ్యర్థి ఎంపిక కూడా పూర్తికావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. దర్శి సీటు జనసేనకు కేటాయించడంతో గరికపాటి వెంకట్ వచ్చి పనిచేయడం ప్రారంభించారు. టీడీపీకి ఆ స్థానం దక్కడంతో టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగింది. కొంతకాలంగా అక్కడ పనిచేస్తున్న వెంకట్కే అవకాశం ఇవ్వాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సిఫార్సు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనికి తోడు టీడీపీలో ఉన్న వారితోపాటు వైఎస్సార్సీపీ ఉన్న మాజీ మంత్రి పేరు పరిశీనకు వచ్చింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అనుచరులు మాత్రం ఆయన పార్టీలో చేరినట్లే, టికెట్ వచ్చినట్లే ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మరోవైపు దర్శి నియోజకవర్గంలో ఫోన్ సర్వే నిర్వహించిన టీడీపీ తాజాగా గరికపాటి వెంకట్, గొట్టిపాటి లక్ష్మి, శిద్దా రాఘవరావు, హర్షిణీ రవికుమార్లపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa