అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో బాల్టిమోర్ ప్రాంతంలో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను.. ఓ భారీ కంటైనర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి.. ఆ షిప్.. బ్రిడ్జిని ఢీకొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన గురించి తెలిసిపోయింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో బ్రిడ్జి కూలిపోవడంతో ఆ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న కార్లు, ఇతర వాహనాలు మొత్తం కింద ఉన్న పటాపస్కో నదిలో పడిపోయాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ కీలక విషయం బయటికి వచ్చింది. ఆ నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం భారత్కు చెందినవారేనని తాజాగా వెల్లడైంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 21 మంది పటాపస్కో నదిలో పడిపోయినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
ఆ భారీ కంటైనర్ నౌక డాలీలో ఉన్న నౌకా సిబ్బంది అందరూ భారతీయులేనని ఆ కంపెనీ వెల్లడించింది. పూర్తిగా 22 మంది భారత సిబ్బందితో ఈ నౌక నడుస్తోందని.. దాన్ని అద్దెకు తీసుకున్న షిప్పింగ్ కంపెనీ మెర్స్క్ స్పష్టం చేసింది. అయితే ఈ ఘటన వెనక ఎలాంటి విద్రోహక కార్యచరణ లేదని.. జరిగిన ప్రమాదానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు పూర్తి వివరాలు అందించినట్లు వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్నప్పుడే డాలీ నౌక చోదక శక్తిని కోల్పోయిందని.. నౌకా సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయినట్లు మేరీ ల్యాండ్ అధికారులను ఉద్దేశిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది.
అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటైన బాల్టిమోర్ సమీపంలో ఓ కార్గో షిప్ ఫ్రాన్సిస్ స్కాట్కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఆ బ్రిడ్జి వెంటనే కుప్పకూలింది. ఇక బ్రిడ్జి కూలిన ఘటనలో నదిలో పడిపోయిన కార్లు, అందులోని ప్రయాణికులు నీటిలో పడిపోయారు. నదిలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు ఆపరేషన్ చేపట్టారు. 948 అడుగుల ఓ భారీ కంటైనర్ నౌక.. బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు సింగపూర్ జెండాతో బయల్దేరింది.
300 మీటర్ల పొడవున్న ఆ డాలీ షిప్.. వంతెనకు సంబంధించిన ఒక పిల్లర్ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ బ్రిడ్జిపై నుంచి 21 మంది వ్యక్తులు నదిలో పడిపోయనట్లు భావిస్తున్నారు. ఆ నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తోంది. 1977 లో బాల్టీమోర్లో ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెన నిర్మించారు. అమెరికా జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి పేరుతో ఫ్రాన్సిస్ స్కాట్కి పేరు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa