వైనాట్ 175 లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జగన్.. అక్కడి నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. తొలిరోజు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతోంది. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల తర్వాత మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. వేంపల్లి, వీఎన్ పల్లి, యెర్రగుంట్ల, ప్రొద్దుటూరు జంక్షన్ మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంది. ఇక జగన్ను చూడ్డానికి జనం బారులు తీరారు. రోడ్ల వెంబడి జగన్కు సాదరస్వాగతం పలికారు. ప్రొద్టుటూరు సభ తర్వాత సాయంత్రం వీరపనాయనిపల్లి మండలంలో తొలిరోజు షెడ్యూల్ ముగుస్తుంది. ఇక ప్రొద్దుటూరు సభ కోసం వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరుగుతున్న తొలి బహిరంగసభ కావటంతో జగన్ ఏం మాట్లాడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రొద్దుటూరుసభ ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa