తిరుమల నుంచి అలిపిరి నడకదారిలో చిరుత, ఎలుగుబంట్లు సంచారం తెలుసుకునేందుకు సుమారు 200 కెమెరాలను ఏర్పాటు చేశామని డీఎఫ్వో సతీష్ తెలిపారు. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులు జంతువుల సంచారంతో భయాందోళనల్లో ఉన్నారని.. భక్తులకు కాలినడకన వెళ్లే మార్గంలో గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు. మానిటరింగ్ కమిటీ ద్వారా అధునాతన సాంకేతికతతో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి.. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్ జీ కెమెరాలు అమర్చడంతో.. పరిసర ప్రాంతాలలో పులుల సంచారం స్పష్టంగా తెలుస్తుందన్నారు.
అలిపిరి నడకమార్గంలో ఈ 200 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి నెల మొత్తం చిరుత సంచారం లేదని.. మార్చి నెల 4 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు సంచరిస్తున్నట్లు గుర్తించామని సతీష్ తెలిపారు. భక్తులు నడక మార్గంలో వెళ్లే సమయంలో సమీపంలోని అడవిలోకి వెళ్లేందుకు అనుమతి లేదని.. నిషేధం విధించినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాలను గమనించి గుంపులుగానే వెళ్లాలని సూచించారు. చిరుత, ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
మరోవైపు తిరుమల పరిసరాలలో ఏనుగుల సంచారం ఉన్నందున వాటిని గుర్తించేందుకు అత్యాధునిక సాఫ్ట్వేర్ కలిగిన డ్రోన్ కెమెరాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు తెలిపార సతీష్. ఈ ప్రక్రియ విజయవంతం అయితే మరిన్ని డ్రోన్ కెమెరాలను వినియోగించి జంతువుల కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. మొత్తానికి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల్ని జంతువుల భయం వెంటాడుతోంది. ఇటీవల తిరుమల నడక మార్గంలో చిరుతతో పాటుగా ఎలుగుబంటి సంచారం కలకలంరేపింది. ట్రాప్ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయి.. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. భక్తులకు సూచనలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa