నేటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో 'వారాహి విజయభేరి యాత్ర' పేరిట ప్రచారం చేయనున్నారు.
ఈరోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గొల్లప్రోలు చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తొలిరోజు శక్తిపీఠం పూర్హుతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దత్త పీఠాన్ని సందర్శించనున్నారు. అనంతరం దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లనున్నారు. ఆయనతో సమావేశం కానున్నారు. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే జనసేన పోటీ చేస్తానని ప్రకటించి తొలిసారి నియోజకవర్గానికి వస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఈ పర్యటనలో జనసేన పార్టీ క్యాడర్ తో సమావేశాలు, నియోజకవర్గంలోని వివిధ వర్గాలతో సమావేశాలు.. పవన్ ప్లాన్ చేశారు. ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న కళ్యాణ్.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న 9న కాకినాడ రూరల్, పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. , 12న రాజానగరంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని జనసేన ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa