పవన్ వారాహి విజయభేరి యాత్రపై పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ... ‘తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రిల్ 12 వరకూ ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్ 2 వరకూ ఆయన పిఠాపురంలో ఉంటారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు పవన్ పిఠాపురం చేరుకుంటారు. తొలిరోజు శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దత్త పీఠాన్ని దర్శిస్తారు. దొంతమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో వారాహి విజయభేరి సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa