మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశెరిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువమంది ఉండటంతో అక్కడ సర్వే జరుగుతోంది. ఇందుకు సంబంధించి సంతృప్తికర ఫలితాలు వచ్చిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రకటనలో జనసేన పార్టీ తెలిపింది.
వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇటీవల ఆయన వైఎస్సార్సీపీని వీడి జనసేన పార్టీలో చేరారు.. మరోసారి ఆయనకు పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది.
జనసేన పార్టీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా ఉదయ్ను స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోదీ, అమిత్ షా చెబితే ఆలోచిస్తానని.. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్, కాకినాడ ఎంపీగా నేను పోటీ చేస్తాం అని పవన్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa