తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెలలో ఆరోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం ఆలయాన్ని శుద్థి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల స్వామికి విశేష సమర్పణ చేస్తారు.
ఆ తర్వాత ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ అర్చకులు ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. అనంతరం పంచాగ శ్రవణం ఉంటుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది ఆస్థానాన్ని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ పేర్కొంది. మరోవైపు ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులకు గమనించాలని సూచించింది.
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఆస్థానం
మరోవైపు ఏప్రిల్ 17వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు సాయంత్రం శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa