ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది.. గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్థత మొదలైంది. జనసేన పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో.. ఆ పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ను ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. వైఎస్సార్సీపీ, టీడీపీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్పార్టీలు గుర్తింపు పొందాయి. రెండు రాష్ట్రాల్లో గతంలో కేటాయించిన గుర్తుల్ని రిజర్వ్ చేయగా.. జనసేనను రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేరింది. దీంతో జనసేన పార్టీ గతంలో పొందిన గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది. ఈ గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఇలా ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసు గుర్తు చేర్చడం జనసేన పార్టీకి ఎదురు దెబ్బ.
జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జనాల్లో కూడా గ్లాసు గుర్తు బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఈ సింబల్ను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో గుర్తును మారిస్తే జనాల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుందని జనసేన పార్టీ కంగారు పడుతోంది. మరి ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa