‘ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం.. వీలైతే వైఎస్ జగన్ ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే నా లక్ష్యం’ అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సునీత కడపలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని అన్నారు. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసునని, ప్రతిసారి ఎవరూ అందరినీ మోసం చేయలేరని అన్నారు. ఏం జరిగిందో కడప ప్రజలకు అంతా తెలుసునని, అన్న సీఎం జగన్ కడప ప్రజల్లో మనిషే కదా?.. ఆయనకు అంత భయమెందుకు? వారు ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని, మీరు ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధమని, సాక్షి చానల్కు రమ్మన్నా చర్చకు వస్తానని సునీత స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa