తెల్లారిలేస్తే మొదలు ప్రతి వార్తాపత్రికల్లోనూ కనిపించేదే. ప్రతి న్యూస్ ఛానెల్లోనూ వినిపించేదే. అయినా జనం మారరు. పోలీసులు చెప్తు్న్నా పట్టింపులేదు. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నా అప్రమత్తత లేదు. అదే అజాగ్రత్త, అదే నిర్లక్ష్యం. ఫలితం చేజేతులా మనమే దొంగలకు ఛాన్స్ ఇచ్చిన వాళ్లమవుతున్నాం. తాజాగా అలాంటి ఘటనే.. అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడిన దుండగులు.. అందినకాడికి దోచేశారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడులో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఇంట్లోకి దూరిన దొంగలు.. 40 తులాల బంగారం దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్తాడు గ్రామానికి చెందిన తులశమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. తులశమ్మకు ఓ కుమార్తె, కుమారుడు తులశమ్మ భర్త చనిపోయాడు. కుమార్తెకు పెళ్లై అత్తగారింటికి వెళ్లిపోయింది. కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. దీంతో తులశమ్మ ఒంటరి జీవితం గడుపుతోంది. కొడుకు పంపుతున్న డబ్బులతో జీవనం సాగిస్తోంది.
అయితే గురువారం ఉదయం తులశమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఏదో పని ఉండి తులశమ్మ బంధువుల ఇంటికి వెళ్దామని అనుకుంది. దీంతో గురువారం ఉదయం తిమ్మంపేటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది తులశమ్మ. మధ్యాహ్నం వరకూ అక్కడే గడిపిన తులశమ్మ.. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంది. అయితే అక్కడ జరిగింది చూసి తులశమ్మ షాక్ తిన్నారు. ఇంటిలో నుంచి ముగ్గురు దుండగులు పారిపోతూ ఉండటం తులశమ్మ గమనించింది. బురఖాలు ధరించిన ముగ్గురు దుండగులు.. ఇంటి వెనుక వైపు నుంచి పారిపోతూ ఉండటం గమనించింది.
దీంతో కంగారుగా ఇంట్లోకి వెళ్లిన తులశమ్మకు అక్కడి సీన్ చూశాక దిమ్మ తిరిగిపోయింది. ఇంట్లో వస్తువులు అన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో మరింత ఆందోళనకు గురైన తులశమ్మ.. బీరువా తెరిచి చూడగా అందులో ఉంచిన నగలు, రూ. 2లక్షల నగదు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ ఊరిజనం వద్ద తన గోడు వెళ్లబోసుకుంది తులశమ్మ.
మరోవైపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తులశమ్మను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 40 తులాల బంగారం, రెండు లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. తులశమ్మ ఫిర్యాదు ఆధారంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకగుండా దుండగులు జాగ్రత్త పడినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa