నూజివీడు ఆర్జీయూకేటీ యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలతో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ చివరి సంవ త్సరం విద్యార్థులు తమ అకాడమీ క్యాలెండర్ పూర్తయిన నేపథ్యంలో క్యాంపస్ ను విడిచివెళ్ళాలని క్యాంప స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ చదువుతున్న దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు మెసేజ్లను పంపి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ప్రాజెక్టును, రివ్యూస్ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సదరు ప్రాజెక్టు, రివ్యూస్ సమర్పణకు ఏప్రిల్ 10వ తేదీ చివరి రోజుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టులు సమర్పించేందుకు ప్రస్తుత ఆదేశాలు తమకు ప్రతిబంధకమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్జీయూకేటీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టెక్ జెట్ వంటి టెక్ఫెస్ట్లు కూడా పూర్తికావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీయూకేటీ పరిధిలోని ఒంగోలు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ క్యాంపస్లలో అకడమిక్ క్యాలెండర్ ఏప్రిల్ 25 వరకు అమలు చేస్తుండగా ఇక్కడ ఏప్రిల్ 8వ తేదీ చివరిరోజుగా పేర్కొంటూ క్యాంపస్ను విడిచివెళ్ళాలని ఆదేశాలు జారీ చేయటంపై విద్యార్థులు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆఫీస్ ఐత్రీ బ్లాక్ వద్ద సోమవారం రాత్రి 9 గంటల వరకు నిరసన తెలిపారు. అభ్యంతరాలపై ఆర్జీయూకేటీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి మంగళవారానికి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని, ఆందోళన విరమించాలని ట్రిపుల్ ఐటీ సిబ్బంది విద్యార్థులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళనను విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa