ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ, జనసేన నాకు అండగా నిలబడ్డాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2024, 06:54 PM

తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్‌కల్యాణ్‌ను  కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు  అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని చెప్పారు. అరాచక పాలన చేస్తున్న జగన్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు. తనకు ఎవరూ లేరనుకున్నారని, ఇప్పుడు తనకు టీడీపీ, జనసేన అండగా ఉంటాయని రఘురామకృష్ణరాజు చెప్పారు. తనకు ఎలాంటి భయం లేదని, ఇటు ప్రజాక్షేత్రంలో, అటు చట్టసభల్లో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఏ సభకు పోటీ చేయాలి అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. తన ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ను రమ్మని అడిగినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తన విజయానికి సహకరించిం, ప్రచారం చేస్తానని పవన్ హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa