అనుభవం ఉన్న నేను.. తపన ఉన్న పవన్, దేశాన్ని నంబర్ వన్ చేయాలన్న మోదీ చేతులు కలిపాం అని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు పెట్టుకున్నాం. మా కోసం కాదు. ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం. పవన్పై వ్యక్తిగత దాడులు చేసినా సరే నిలబడ్డారు. నేను కష్టాల్లో ఉన్నప్పడు వచ్చి బేషరతుగా మద్దతు ప్రకటించారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. అందుకే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి వచ్చాయి. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్కు పోతాడు. ఎన్నికల తర్వాత చేతిలో చిప్ప పట్టుకుని ఎక్కడికి పోతాడో చేసి చూపిస్తాం. పవన్, నేను ఘర్షణ పడుతున్నామంటూ సోషల్ మీడియాలో తప్పుడు సంతకాలతో పెడుతున్నారు. ఫేక్ న్యూస్ను నమ్మొద్దు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి క్షణం అభివృద్ధి కోసం పరితపించాం. రాజధాని అమరావతిని తీసుకొచ్చాం. పోవలరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. 18 కేంద్ర విద్యా సంస్థలు తీసుకొచ్చాం. పేదలకు వంద సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఐదేళ్లలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. యువతకు ఉద్యోగాలు కల్పించాం. మళ్లీ జాబు రావాలంటే కూటమి గెలవాలి. కూటమి రావాలంటే ప్రతి ఒక్కరూ 30 రోజులు పనిచేయండి. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలి. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని బతికించడానికి ఎన్డీయే రావాలి. పోలవరం పూర్తి కావాలి. పరిశ్రమలు రావాలి. అందుకు మోదీ సహకారం కావాలి. ఒక అహంకారి, విధ్వంసకారుడిపై పవన్, నేను పోరాడుతున్నాం. పిల్లల భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించి ఓటేయండి అని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa