సంచలనం సృష్టించిన ఒంగోలు దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంగోలులో గత గురువారం భారీ దోపిడీ జరిగింది. ఏటీఎం మెషీన్లలో నగదు నింపే సీఎంఎస్ వాహనంలో నుంచి నగదు కాజేశారు. పట్టపగలే వాహనంలో నుంచి 66 లక్షలు కాజేసిన దుండగులు.. ఆ డబ్బంతా తీసుకెళ్లి ఓ మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసును 24 గంటల్లోపే ఒంగోలు పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారం వెనుక సీఎంఎస్ మాజీ ఉద్యోగి మహేష్ బాబుతో పాటుగా ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ పాత్ర ఉన్నట్లు తేల్చారు.
అనంతరం టెక్నాలజీ సాయంతో దొంగలను గుర్తించారు. సీఎంఎస్ మాజీ ఉద్యోగి మహేష్ను పేర్నమిట్టలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోచుకున్న సొమ్మను మర్రిచెట్టులో దాచిన విషయం వెల్లడించటంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో మహేష్ బాబుతో పాటుగా రాజశేఖర్, కొండారెడ్డి ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు.
అయితే జైలుకు వెళ్లిన మహేష్ బాబు బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ తర్వాత సొంతూరు సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెం వెళ్లారు. అయితే బెయిల్ మీద వచ్చి ఇంటి వద్ద ఉంటున్న మషేష్ బాబు.. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు ఈ విషయాన్ని గుర్తించారు. చోరీ కేసు గురించి గురువారమే తమకు తెలిసిందంటున్న మహేష్ కుటుంబసభ్యులు.. ఆ ఘటన కారణంగానే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాశతో చేసిన పని.. చివరకు ఓ కుటుంబంలో ఇలా తీరని వేదనను మిగిల్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa