ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నారని వైయస్ఆర్సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏదైనా ప్రభుత్వానికి 60 నెలలు పాలించాలని ప్రజలు ఎన్నుకుంటారని, కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికేయాలని అనుకుంటున్నారని, ఇక్కడ గొంతు పట్టుకుంటున్నది నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతల, విద్యార్థుల గొంతును నొక్కుతున్నారని వీరు మరచిపోతున్నారన్నారు. మంగళగిరి సీటు బీసీలదని, ఈ సీటు ఎమ్మెల్యే ఆర్కే త్యాగం చేయమని చెబితే ఆయన సీటును తీసి నా చెల్లి లావణ్యకు ఇచ్చానని, వాళ్లు మాత్రం బీసీల సీటే కదా డబ్బులతో గెలవచ్చు అని పెద్ద పెద్ద సంచులతో బయలుదేరారని విమర్శించారు. సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa