ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్లలో సినీ రచయిత కోన వెంకట్‌పై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు.. పోలీస్ స్టేషన్‌లో హై టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 06:12 PM

బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్‌పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు కర్లపాలెం పోలీసులు. గణపరానికి చెందిన ఎస్సీ నేత కత్తి రాజేష్‌.. తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. రాజేష్ తన అనుచరులతో కలిసి.. శనివారం తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ క్రమంలో రాజేష్ తమ దగ్గర రూ.8లక్షలు తీసుకున్నారని.. ఇప్పుడు సడన్‌గా వెళ్లి టీడీపీలో చేరానరని వైఎస్సార్‌సీపీ నేతలు కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రాజేష్‌ను పీఎస్‌కు తీసుకొచ్చారు.


ఈ క్రమంలో తనను ఎస్సై ఛాంబర్‌లో బాపట్ల వైఎస్సార్‌సీపీ కోన రఘుపతి బంధువైన కోన వెంకట్, వైఎస్సార్‌సీపీ నేతలు దాడి చేశారని రాజేష్ ఆరోపించారు. ఎస్సై కూడా తనను కొట్టారని.. ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైఎస్సార్‌సీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరాననే అక్కసుతో టార్గెట్ చేశారని ఆరోపించారు. వెంటనే ఈ ఘటనపై అందుకున్న బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌, అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే గోవర్థన్ రెడ్డిలు కార్యకర్తలతో కలిసి కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లారు. ఇటు రాజేష్ కుటుంబ సభ్యులతో పాటూగా గణపవరానికి చెందిన ఎస్సీకాలనీ స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు.


కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.గణపవరం ఎస్సీ కాలనీకి చెందిన వారు భారీగా అక్కడికి చేరుకుని.. కోన రఘుపతి, కోన వెంకట్, పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. వెంటనే స్థానిక డీఎస్పీ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రంగంలోకి దిగారు.. ఈ ఘటనపై ఆరా తీశారు.


రాజేష్‌పై దాడి చేసిన ఘటనలో.. కోన వెంకట్, ఉపాధ్యాయుడు నక్కా సంతోష్‌, మార్పు బెనర్జీ, కాగిత మోజెస్‌, మార్పు రత్నంతో పాటుగాఎస్సై జనార్దన్‌లపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలోనే యువకుడిపై దాడి చేయడంపై డీఎస్పీ కూడా సీరియస్‌గా స్పందించారు. డీఎస్పీ ప్రాథమిక నివేదిక ఆధారంగా కర్లపాలెం ఎస్సై జనార్ధన్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్సీ వకుల్ జిందాల్ ఉత్తర్వులు ఇచ్చారు. కోన వెంకట్ బాపట్ల అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోన రఘుపతికి బంధువు. ప్రస్తుతం ఆయన కర్లపాలెం మండలానికి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa