ఏపీ ఎన్నికల పోలింగ్ ఈసారి భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్న ప్రజలు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పోలింగ్ సమయం మరో గంటతో ముగియనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ సరళిపై ట్వీట్ చేశారు. "రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓట్లు వేయడంపై వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు సాయంత్రం కావొస్తోంది. ఉదయం 7 గంటలకు.. ఎంత పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో ఉన్నారో... పోలింగ్ ముగిసే ఈ సమయంలో కూడా అంతే ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ప్రజలు ఓటింగ్పై ఇంత ఉత్సాహం చూపడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. ఆ వర్గం ఈ వర్గం అని లేదు.. అన్ని వర్గాలు వచ్చి ఓటేస్తున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు.. అన్ని ప్రాంతాల్లో అదే జోరు కనిపిస్తోంది." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
" మాచర్ల, నర్సారావుపేట వంటి చోట్ల ఓటమి భయంతో వైసీపీ హింసకు పాల్పడింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే వైసీపీ గూండాలు దాడి చేశారు. అదే విధంగా నర్సారాపుపేట లోక్ సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే ఓటరుపై చేయి చేసుకున్నారు. ఇంత స్థాయిలో హింస జరిగినా ప్రజలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇంకా పోలింగ్ కేంద్రాలకు వస్తూనే ఉన్నారు. ఈ చైతన్యం, ఈ సంకల్పం చూస్తుంటే...ఈ రోజు రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఓటు వేయ్యాలనే ప్రజల ఈ సంకల్పం రాష్ట్రానికి మేలు చేస్తుంది" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
"గత ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ జరిగింది. ఈ ఏడాది ఇప్పుడున్న జోరు చూస్తే 85 శాతం పైగా పొలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీన్ని కూటమి స్వాగతిస్తోంది. 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు తమ తీర్పును ఇవ్వాలని విజ్ఝప్తి చేస్తున్నాను. నేటి మీ ఓటు.. రేపటి మీ భవితకు బంగారు బాట అవుతుంది. స్వేచ్చ, స్వాతంత్య్రం .. కనీస హక్కులతో కూడిన గౌరవ ప్రదమైన జీవితాన్ని మీకు అందించేది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని మీ ఓటుతో కాపాడండి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa