ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల ఇంట్లోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ యువకుడు.. 20 రోజుల్లో రెండు పెళ్లిళ్లు

national |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 07:53 PM

ఓ యువకుడు ఒకరికి తెలియకుండా మరొకరితో ఇద్దరు మహిళలతో సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా బయటికి తెలియడంతో వారిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ ఇద్దరు మహిళలను 20 రోజుల తేడాతోనే వివాహం చేసుకోవడం గమనార్హం. ఒక పెళ్లి చేసున్నట్లు బయటికి చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయం కాస్తా వెలుగులోకి రావడం పెను సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆ యువకుడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఆ యువకుడికి పెళ్లి అయిన విషయం తెలుసుకున్న రెండో భార్య.. మొదటి భార్య, భర్తతో కలిసి ఉండేందుకు రెడీగా ఉండటం గమనార్హం. ఇక ఆ యువకుడు పెళ్లి చేసుకున్న ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయి ఓ బిడ్డ కూడా ఉండటం విచిత్రం.


ఈ సంఘటన బీహార్‌లోని జముయ్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్షర గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడిపై మలయ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వినోద్ కుమార్‌కు మొదట లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌కాడిహ్ గ్రామానికి చెందిన ప్రీతి కుమారి అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే ప్రీతి కుమారికి అప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. వారి ఫేస్‌బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ కలవాలని నిర్ణయించుకున్నాడు. ప్రీతి కుమారిని కలిసేందుకు ఏప్రిల్ 22 వ తేదీన ఆమెను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అది గమనించిన నవ్‌కాడిహ్ గ్రామస్తులు.. వినోద్ కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే వినోద్ కుమార్, ప్రీతి కుమారిని గుడికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేశారు. దీంతో వినోద్ కుమార్ ఇంటికి వెళ్లి.. ప్రీతి కుమారి కాపురం చేస్తోంది.


ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు ట్విస్ట్ ఆ తర్వాతే చోటు చేసుకుంది. ప్రీతి కుమారితో పెళ్లి కాకముందే వినోద్ కుమార్‌కు మరో మహిళతో కూడా సంబంధం కొనసాగించాడు. డీజే ఆపరేటర్‌గా పనిచేసే వినోద్ కుమార్.. అదే డీజేలో పనిచేసే గిరిజా కుమారి అనే మహిళా సింగర్‌తో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఒకే దగ్గర పనిచేసే వారిద్దరి మధ్య బంధం.. స్నేహం, ప్రేమ దాటి మరో లెవల్‌కు చేరుకుంది. ప్రీతి కుమారితో వివాహం అయినప్పటికీ గిరిజా కుమారితోనూ వినోద్ కుమార్ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు.


అయితే ఈ విషయాన్ని మొదటి భార్య ప్రీతి కుమారికి తెలియకుండా రహస్యంగా సాగిస్తూ వచ్చాడు. అయితే ప్రీతి కుమారితో పెళ్లి అయిన కొన్ని రోజులకే గిరిజా కుమారిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అది గమనించిన గ్రామస్తులు.. గిరిజా కుమారి, వినోద్ కుమార్‌లను ఇద్దరినీ ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేశారు. అయితే వినోద్ కుమార్‌కు పెళ్లి అయిన విషయం వారికి తెలియకపోవడం గమనార్హం. దీంతో 20 రోజుల వ్యవధిలోనే వినోద్ కుమార్‌ ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అయితే తన భర్త రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య ప్రీతి కుమారి.. వినోద్ కుమార్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే.. వినోద్ కుమార్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని రెండో భార్య గిరిజా కుమారి చెప్పడం విశేషం. ముగ్గురం కలిసి జీవించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండో భార్య వెల్లడించింది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa