ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్‌లో 4 గంటలు ఆలస్యంగా దిగిన సీఎం జగన్ ప్రత్యేక విమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 03:41 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్‌ విమానాశ్రయంలో దిగింది.


షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు లండన్‌లోని లూటాన్‌ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. దీంతో ఆ విమానం 47 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికి కూడా ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.


దీంతో ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు సీఎం జగన్‌ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో తిరిగి లండన్‌కు బయల్దేరారు. చివరికి మధ్యాహ్నం 2.30 గంటలకు లూటాన్‌ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్‌ అయింది. జగన్‌ కుటుంబం లండన్‌కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్డియర్‌ 7500 విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రప్పించారు. లండన్, అక్కడి నుంచి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి చివరికి ఈ నెల 31 వ తేదీన తిరిగి తాడేపల్లికి రానున్నారు. అయితే ఫోన్నంబర్, ఈ-మెయిల్ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa