మీరు తిరుమలకు వెళ్తున్నారా అయితే కాసేపు ఆలోచించండి. సెలవుల నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో భారీగా రద్దీ ఏర్పడి శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున లైన్లు కొనసాగుతున్నాయి. శనివారమే జనంతో తిరుమల కొండ కిక్కిరిసిపోగా.. ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో భారీగా రద్దీ నెలకొంది. ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు మొత్తం నిండిపోయాయి. రింగు రోడ్డు మీది నుంచ ఆక్టోపస్ బిల్డింగ్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర శ్రీవారి భక్తులతో బారులుతీరారు. దీంతో భక్తులు భారీగా వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
స్వామి వారి దర్శనానికి అధిక సమయం పడుతుండటంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. లైన్లలో పడిగాపులు కాస్తున్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. దర్శనాలకు సంబంధించిన పరిస్థితిని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. అయితే తిరుమలలో భక్తుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం సర్కిల్ వరకు క్యూలైన్ పెరిగిపోయింది. స్లాట్లు ఉన్న భక్తులను విడతల వారీగా క్యూలైన్లలోకి అనుమతిస్తుండటంతో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి క్యూలైన్ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇక స్వామి వారికి తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టల్లోనూ రద్దీ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa