ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సతీమణితో సహా అమెరికాకు చంద్రబాబు,,,,వైద్య పరీక్షల కోసమన్న పార్టీ వర్గాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 03:48 PM

ఏపీలో ఎన్నికలకు ముగిశాయి. ఈనెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా, ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్షణం తీరిక లేకుండా ప్రజల్లో ఉంటూ ఓటర్లను ప్రస్ననం చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పోలింగ్ ముగియటంతో నేతలు రిలాక్స్ అవుతున్నారు. వారి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.


జగన్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విదేశీ పర్యటనుకు వెళ్లారు. సతీమణి భువనేశ్వరితో సహా అమెరికా బయల్దేరి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అమెరికా బయలుదేరి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్ వెళ్లారు. పరీక్షలు పూర్తయ్యాక ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో సహా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.


ఇక సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్‌లోనే ఉంటున్నారు. అక్కడే వారు ఉన్నత విధ్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈనెల 17న ఆయన లండన్ వెళ్లగా.. విదేశీ పర్యటన అనంతరం తిరిగి ఈ నెల 31న ఏపీకి రానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa