కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరిచివర రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఒంటిపై దుస్తులు లేకుండా... నగ్నంగా మహిళ మృతదేహం కనిపించడం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేసింది. అయితే ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేసి ఉంటారని.. పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు గ్రామసమీపంలో ఓ మహిళ మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు..వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తేటకుంట్ల, వెంకటాపురం మార్గంలో రోడ్డుపక్కన మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉందని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహం చుట్టూ ఆధారాల కోసం గాలించారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. అలాగే ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా నగ్నంగా ఉంది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతదేహం పడి ఉన్న తీరును గమనించి.. ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తు్న్నారు. అలాగే నగ్నంగా ఉండటంతో.. ఎవరైనా అత్యాచారం చేసి.. ఆపై హత్యచేశారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఊరి చివరన నగ్నంగా మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa