తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పరోక్షంగా కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను లోకేష్కు అప్పగించాలని.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ను ఎన్నుకోవాలని కోరారు. ఇది తన విన్నపం కాదు .. డిమాండ్ అన్నారు. చంద్రబాబు దగ్గర తనకు మాట్లాడే చనువు ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నానని.. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మరో 30 ఏళ్లు చూసుకునే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు బాగా పని చేశారని.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయనకు మంచి పదవిని చంద్రబాబు ఇస్తారన్నారు. బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి కచ్చితంగా ప్రమోషన్ ఇచ్చి.. కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. 286 రోజుల పాటు 3132 కి మీ పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్.. లక్షలాది మంది అభిమానం సంపాదించారని.. పార్టీ కాపాడే యువశక్తి ఉన్న వ్యక్తి ఆయన మాత్రమే అన్నారు.
ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావటం తథ్యమన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని.. చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో పార్టీని ఈదుతున్నారన్నారు. ఇప్పుడు ఆయనకు లోకేష్ , బ్రహ్మణి , భువనేశ్వరి , ముగ్గురు తోడయ్యారన్నారు. టీడీపీని మళ్లీ టీడీపీ అధికారం లోకి వస్తుంది అంటే అందరి పాత్ర ఉందన్నారు. టీడీపీ కూటమి 130 స్థానాలకు పైగా కూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆత్మ కథ రాసుకుంటే దానిలో తనకు ఒక పేజీ కచ్చితంగా ఉంటుందన్నారు. చంద్రబాబు రాముడైతే.. తాను ఆంజనేయుడిగా, విధేయుడిగా ఉన్నానన్నారు. 2019 నుంచి పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. రాజకీయ నాయకుడి పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర లేదని.. తాను ఆ పని చేశానన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వస్తే.. రాష్ట్రంలో పార్టీ పని అయిపోయందని, పదవులు అనుభవించిన నేతలు కొందరు వెటకారంగా మాట్లాడారని.. ఈ ఐదేళ్లు తెలుగు దేశం పార్టీ కోసం, కార్యకర్తలకు అండగా చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందన్నారు. చంద్రబాబుకు తోడు.. భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి.. నలుగురు నాలుగు దిక్కులుగా పార్టీ కోసం పని చేశారన్నారు. నారా కుటుంబానికి అండగా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు అండగా ఉన్నారన్నారు. టీడీపీ బాధ్యతలు నారా లోకేష్కు అప్పగించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa