ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 08:38 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భారీగా ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అమ్మవారి గుడి ఆదాయం రూ.46.15లక్షలు వచ్చింది. వరుసగా అమ్మవారికి ఆదాయం పెరుగుతూ వచ్చింది.. ఈ నెల 24న రూ. 42.05 లక్షలు ఆదాయం వచ్చిది.. ఈ నెల 25న రూ.32.43 లక్షలు రావడం విశేషం. ఆదివారం ఆదాయం విషయానికి వస్తే.. రూ.500 టిక్కెట్ల ద్వారా రూ.13లక్షల 500, రూ.300 టికెట్ల ద్వారా రూ.5 లక్షల 23వేల800, రూ.100 టికెట్ల ద్వారా రూ.8 లక్షల 47వేల 800 ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం ద్వారా రూ.61వేల 575, పులిహోర ప్రసాదం ద్వారా రూ.32వేల 490 ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఈవో రామారావు వివరాలను వెల్లడించారు.


 బెజవాడ దుర్గమ్మకు మూడు రోజుల్లోనే ఇంత భారీగా ఆదాయం రావడం విశేషం. సాధారణంగా దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మవారికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు సెలవు రోజుల్లో కూడా అమ్మవారి దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా మూడు రోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరింది. గత శుక్ర, శని, ఆదివారాల్లో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారులు తీరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa